Vishnu Kundinulu (విష్ణు కుండినులు) Dynasty – Part 2
విష్ణు కుండినులు రాజవంశం దక్షిణ భారత చరిత్రలో ఒక విశిష్టమైన స్థానం సంపాదించింది. ఈ వ్యాసంలో మూడవ మాధవవర్మ నుండి చివరి పాలకుల వరకు పాలన, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు మరియు బౌద్ధమత ప్రోత్సాహం గురించి తెలుసుకుందాం.
5. మూడో మాధవవర్మ
- ఈపూరు తామ్ర శాసనం వేయించాడు.
- త్రికూట మలయాధిపతి అనే బిరుదు కలిగి ఉన్నాడు.
- రాజధాని – అమరపురం (అమరావతి).
- ఇంద్రవర్మ, అగ్నిశర్మ బ్రాహ్మణులకు మ్రోతుకలి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చినట్లు శాసనం ఉంది.
6. ఇంద్రభట్టాకర వర్మ
- అనేక అగ్రహారాలను బ్రాహ్మణులకు దానం చేశాడు.
- అనేక ఘటికా స్థానాలను (హిందూ విద్యా కేంద్రాలు) స్థాపించాడు.
- కీసర సమీపంలోని ఘటకేశ్వరము (ఘట్ కేసర్) ఘటికాస్థానం స్థాపకుడు.
- సత్యాశ్రయుడు అనే బిరుదు కలిగి ఉన్నాడు.
7. విక్రమేంద్రభట్టారక వర్మ
- ఇంద్రభట్టారక వర్మ పెద్ద కుమారుడు.
- ఉత్తమాశ్రయుడు అనే బిరుదు.
- రాజధానిని అమరావతి నుండి లెందులూరు (దెందులూరు)కు మార్చాడు.
- బ్రాహ్మణులకు తుండి గ్రామం దానం చేశాడు.
- పరమ మహాదేవి విహారానికి ఇరుందెర గ్రామం దానం.
8. నాలుగో మాధవవర్మ
- జనాశ్రయ అనే బిరుదు కలిగి ఉన్నాడు.
- ఈపూరు 2, పొలమూరు 2 శాసనాలు వేయించాడు.
- విజయవాడ దుర్గామల్వీరస్వామి భక్తుడు.
- చివరి పాలకుడు మంచన భట్టారకుని తరిమివేసి చాళుక్యులు రాజ్యం ఆక్రమించారు.
- రాజలాంఛనము – సింహము (నాణేలపై లంఘించు సింహము ముద్ర).
పరిపాలన
- రాజ్యాన్ని రాష్ట్రాలు, విషయాలుగా విభజించారు.
- విషయాధిపతి, హస్తికోశుడు (గజబలాధ్యక్షుడు), వీరకోశుడు (పదాతి దళాధిపతి) వంటి సైనికాధికారులు.
- ప్రాంతీయాధిపతులు దానాలు కూడా చేసేవారు.
ఇతర అధికారులు
- రజ్జుక: భూములను కొలిచి పన్నులు నిర్ణయించేవారు.
- ఫతదారుడు: పంట అంచనా వేసి శిస్తు నిర్ణయించేవాడు.
- గుల్మికుడు: సరిహద్దు రక్షణాధికారి.
- సెట్టి: ధాన్యాదాయ కొలత బాధ్యత.
- అక్షపటలాధికారి: రాజాజ్ఞలను రాసేవాడు.
ఆర్థిక పరిస్థితులు
- ఇక్ష్వాకుల తరువాత నాణేలు ముద్రించిన వారు.
- రాగి మలామా చేసిన ఇనుము నాణేలు.
- వాణిజ్యం క్షీణించడం వల్ల విదేశీ వాణిజ్యం తగ్గింది.
- బర్మా, సయాం, కాంబోడియా, చైనా, జపాన్, సిలోన్ దేశాలతో వాణిజ్యం కొనసాగింది.
- చక్రవర్తుల అలంపురం వద్ద రోమన్ బంగారు నాణేలు కనుగొన్నారు.
న్యాయ పరిస్థితులు
- రాజు ముఖ్య న్యాయాధిపతి.
- దివ్య పరీక్షల ద్వారా నేర విచారణ.
సామాజిక పరిస్థితులు
- వైదిక మతానికి ప్రాధాన్యం.
- కులవ్యవస్థ బలపడింది.
- వైష్ణవ, శైవ భక్తి సమానంగా.
- శ్రీ పర్వతస్వామి కులదైవం.
- వివిధ దేవతా విగ్రహాలు నిర్మాణం (ఉదా: కొండమోటు నరసింహ).
బౌద్ధమతం
- గోవింద వర్మ బౌద్ధమతాన్ని ప్రోత్సహించాడు.
- విక్రమేంద్ర వర్మ పరమ మహాదేవి విహారానికి గ్రామం దానం చేశాడు.
- కీసరగుట్టలో మహాయాన ఆనవాళ్లు.
- తర్కపండితుడు దిగ్నాగుడు నివాసం.
- వజ్రయాన శాఖ వ్యాప్తి, శక్తి పూజలు.
- చివరి తెలుగు రాజులు బౌద్ధమతాన్ని ప్రోత్సహించిన వారు విష్ణు కుండినులు.